పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : భగీరథుని చరితంబు

  •  
  •  
  •  

9-226-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"తత్త్వజ్ఞులు శాంతచిత్తులు తపః పారీణు లార్యుల్ ఘనుల్
బురుషశ్రేష్ఠులు వచ్చి తల్లి! భవదంభోగాహముల్ చేయఁగా
సంఘాఘము నిన్నుఁ బొందునె జగన్నాథుండు నానాఘ సం
రుఁ డా విష్ణుఁడు వారిచిత్తములఁ దా నై యుంట మందాకినీ.

టీకా:

పరతత్త్వజ్ఞులు = పరబ్రహ్మజ్ఞానలు; శాంతచిత్తులు = శాంతస్వభావులు; తపస్ = తపస్సుచేయుటలో; పారీణులు = మిక్కిలినేర్పరులు; ఆర్యుల్ = పూజ్యులు; ఘనుల్ = గొప్పవారు; పురుష = మానవులలో; శ్రేష్ఠులు = ఉత్తములు; వచ్చి = చేరి; తల్లి = అమ్మా; భవత్ = నీయొక్క; అంభోగావముల్ = నీటిస్నానములు; చేయగాన్ = చేయుటవలన; నర = మానవ; సంఘ = జాతి; అఘము = పాపము; నిన్నున్ = నిన్ను; పొందునె = చెందునా, చెందదు; జగన్నాథుండు = విష్ణుమూర్తి {జగన్నాథుడు - భువనములకు ప్రభువు, విష్ణువు}; నానా = సమస్తమైన; అఘ = పాపములను; సంహరుడు = నాశనముచేయువాడు; ఆ = ఆ; విష్ణుడు = విష్ణుమూర్తి; వారి = వారియొక్క; చిత్తములన్ = మనసులందు; తానై = తానుగా; ఉంటన్ = ఉండుటచేత; మందాకినీ = గంగా {మందాకిని - మందముగ వక్రగమనముతో ప్రవహించునది, ఆకాశగంగ}.

భావము:

“అమ్మా! గంగాదేవీ! పరబ్రహ్మజ్ఞానులు, పరమ శాంత స్వభావులు, మహా తపోధనులు, పూజ్యులు అయిన మానవోత్తముల యందు విష్ణుమూర్తి ఉంటాడు కదా. అట్టి మహానుభావులు చేరి నీ నీటిలో స్నానాలు చేయుట వలన పాపులు వచ్చి స్నానాలు చేసి కలిపిన సర్వ పాపాలు నశిస్తాయి తల్లీ!