పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : మాంధాత కథ

  •  
  •  
  •  

9-180-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పెక్కండ్రు రాజముఖులకు
నొక్కఁడు మగఁ డయ్యుఁ దనియకుండె మునీంద్రుం
డెక్కుడు ఘృతధారలచే
క్కజమై తృప్తి లేని నలుని భంగిన్.

టీకా:

పెక్కండ్రు = అనేకమంది; రాజముఖులు = అందగత్తెలు {రాజముఖి - రాజ (చంద్రునివంటి) ముఖి (మోములుగలస్త్రీ), సుందరి}; కున్ = కు; ఒక్కడు = ఒకడే; మగడు = భర్త; అయ్యున్ = అయినప్పటికి; తనియకుండెన్ = తృప్తిచెందకుండెను; ముని = మునులలో; ఇంద్రుండు = శ్రేష్ఠుడు; ఎక్కుడు = అధికమైన; ఘృత = నేతి; ధారలన్ = ధారగాపోయుటలు; చేన్ = వలన; అక్కజము = అధికమైనది; ఐ = అయ్యి; తృప్తి = సంతృప్తి; లేని = పొందనట్టి; అనలుని = అగ్ని; భంగిన్ = వలె.

భావము:

కాని, ఎంత నేతి ధార పోసనా తృప్తి పొందని అగ్ని వలె, అనేకమంది సుందరీమణులకు ఒకడే భర్త అయి ఉన్నా సౌభరి ముని ఇంద్రియ వాంఛలు తృప్తి చెందటం లేదు.