పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : మాంధాత కథ

  •  
  •  
  •  

9-177-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"కోలులార! వీఁడు నలకూబరుఁడో; మరుఁడో; జయంతుఁడో;
యేఱి వచ్చె; వీనిఁ దడవేల వరింతుము నేమ యేమ" యం
చా మునినాథుఁ జూచి చలితాత్మికలై సొరదిన్ వరించి రా
భామిను లందఱుం గుసుమబాణుఁడు గీ యని ఘంట వ్రేయఁగన్.

టీకా:

కోమలులార = చెలులు; వీడు = ఇతడు; నలకూబరుడొ = నలకూబరుడొ; మరుడొ = మన్మథుడొ; జయంతుడొ = జయంతుడొ; ఏమరి = పొరపాటున; వచ్చెన్ = వచ్చెను; వీనిన్ = ఇతనిని; తడవున్ = ఆలస్యముచేయుట; ఎల = ఎందుకు; వరింతము = వరించెదము; నేమ = మేము; యేమ = మేము; అంచున్ = అనుచు; ఆ = ఆ; ముని = మునులలో; నాథున్ = గొప్పవానిని; చూచి = చూసి; చలిత = చలించిపోయిన; ఆత్మికలు = మనసులుగలవారు; ఐ = అయ్యి; సొరదిన్ = క్రమముగా; వరించిరి = కోరుకొనిరి; భామినులు = సుందరులు; అందఱున్ = అందరు; కుసుమబాణుడు = మన్మథుడు {కుసుమబాణుడు - పూలబాణముల వాడు, మన్మథుడు}; గీయని = తీవ్రమగ; ఘంటవ్రేయగన్ = మోహము రెచ్చగొట్టగా.

భావము:

ఆ సుందరీమణులు అందరూ ఇతడు నలకూబరుడొ, మన్మథుడొ, జయంతుడొ పొరపాటున వచ్చాడు అనుకున్నారు. వెంటనే ఆ మునిని చూసి చలించిపోయిన వారందరు మేము ఇతనిని వరిస్తున్నాము, వివాహం చేసుకుంటాము అన్నారు.