పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : అంబరీషోపాఖ్యానము

  •  
  •  
  •  

9-97-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"ముని నీరు జొచ్చి వెడలడు
నియెడు ద్వాదశియు నింత నియెన్నీలో
పారణయున్ వలయును
వినిపింపుం డర్హధర్మవిధ మెట్టిదియో?'

టీకా:

ముని = ఋషి; నీరు = నీటిలోనికి; చొచ్చి = స్నానమునకువెళ్ళి; వెడలడు = బయటకురాడు; చనియెడున్ = వెళ్ళిపోవుచున్నది; ద్వాదశియున్ = ద్వాదశితిథి; ఇంతన్ = ఇంతసమయము; చనియెన్ = అయిపోయినది; ఈలోనన్ = ఈలోపల; పారణయున్ = ఆహారముగ్రహించుట; వలయును = చేయవలెను; వినిపింపుండు = చెప్పండి; అర్హ = తగిన; ధర్మ = ధర్మమైన; విధము = చేయవలసినది; ఎట్టిదియో = ఎలానో.

భావము:

“దూర్వాస మహర్షి స్నానమునకు వెళ్ళి ఇంకా రావడం లేదు, కొద్ది సమయంలోనే ద్వాదశితిథి వెళ్ళిపోతోంది ఈ లోపల ఆహారము గ్రహించాలి కదా. ఇప్పుడు నేను ఏం చేయాలో తగిన ధర్మం నిర్ణయించి చెప్పండి.”