పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : అంబరీషోపాఖ్యానము

  •  
  •  
  •  

9-84-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

న వైభవంబునఁ ల్మషదూరుఁడై-
జ్ఞేశు, నీశు, నబ్జాక్షుఁ గూర్చి,
మొనసి వసిష్ఠాది మునివల్లభులతోడఁ-
గిలి, సరస్వతీ టమునందు
మేధతో బహువాజిమేథంబు లొనరించె-
ణుతింపరాని దక్షిలు బెట్టి;
మలోష్టహేముఁడై, ర్వకర్మంబులు-
రిపరంబులు గాఁగ వని యేలె;

9-84.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విష్ణుభక్తులందు, విష్ణువునందుఁ, గ
లంక యెడల, మనసు లంకె వెట్టి,
విహితరాజ్యవృత్తి విడువనివాఁడునై,
తఁడు రాచతపసి నఁగ నొప్పె.

టీకా:

ఘన = గొప్ప; వైభవంబునన్ = వైభవముతో; కల్మష = పాపములకు; దూరుడు = దూరముగనున్నవాడు; ఐ = అయ్యి; యజ్ఞేశున్ = నారాయణుని {యజ్ఞేశుడు - యజ్ఞములకు అధిపతి, విష్ణువు}; ఈశున్ = నారాయణుని; అబ్జాక్షున్ = నారాయణుని {అబ్జాక్షుడు - పద్మములవంటి కన్నులు గలవాడు, విష్ణువు}; కూర్చి = గురించి; మొనసి = పూని; వసిష్ఠ = విసిష్ఠుడు; ఆది = మున్నగు; ముని = మునులలో; వల్లభులు = శ్రేష్ఠుల; తోడన్ = తోటి; తగిలి = చేరి; సరస్వతీ = సరస్వతీనదియొక్క; తటమున్ = ఒడ్డు; అందున్ = పైన; మేధ = చుఱుకైనబుద్ధి {మేధ - చురుకుదనముగల బుద్ధి (జ్ఞాపకశక్తి కలదికానిది)}; తోన్ = తోటి; బహు = అనేకమైన; వాజిమేథంబులు = అశ్వమేథయాగములు; ఒనరించె = చేసెను; గణుతింప = లెక్కపెట్టుటకు; రాని = సాధ్యముకానన్ని; దక్షిణలు = దక్షిణలు; పెట్టి = ఇచ్చి; సమలోష్టహేముఁడు = సమదృష్టికలవాడు {సమలోష్టహేముడు -సమ (సమదృష్టి) లోష్ట (మట్టిపెళ్ళలు) హేమ (బంగారము)లందు గలవాడు, సమదృష్టిగలవాడు}; ఐ = అయ్యి; సర్వ = సమస్తమైన; కర్మంబులున్ = కర్మలను; హరి = నారాయణుని; పరంబులు = సమర్పించినది; కాగన్ = అయినట్లు; అవనిన్ = భూమండలమును; ఏలెన్ = పరిపాలించెను.
విష్ణు = హరి; భక్తులు = భక్తులు; అందున్ = ఎడల; విష్ణువున్ = హరి; అందున్ = ఎడల; కలంక = గురి; ఎడల = అతిశయించగ; మనసు = మనసును; లంకె = లగ్నము; పెట్టి = చేసి; విహిత = నియమించబడిన; రాజ్య = రాజ్యపాలన; వృత్తిన్ = ధర్మమును; విడువని = వదలివేయని; వాడున్ = వాడు; ఐ = అయ్యి; అతడు = అతడు; రాచతపసి = రాజర్షి; అనగన్ = అనుటకు; ఒప్పెన్ = తగియుండెను.

భావము:

ఆ అంబరీషుడు గొప్ప వైభవంతో కల్మషాలకు దూరంగా ఉండేవాడు. యజ్ఞేశుని, నారాయణుని, అబ్జాక్షుని గురించి వసిష్ఠాది మహామునులతో చేరి సరస్వతీనది ఒడ్డున లెక్కపెట్టలేనన్ని దక్షిణలు ఇచ్చి అనేక అశ్వమేథయాగాలు చేసాడు. సమదృష్టికలవాడు సర్వ కర్మలను నారాయణ పరంగా ఆచరిస్తూ రాజ్య పరిపాలన సాగించాడు. విష్ణు భక్తులు ఎడల, హరి ఎడల చక్కటి గురి కలిగి ఉండి రాజ్యపాలన ధర్మాన్ని; విడువక చేసేవాడు. కనుక, ఆయన రాజర్షి అనుటకు తగినవాడు.