పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : అంబరీషోపాఖ్యానము

  •  
  •  
  •  

9-80-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అంత నాభాగునకు నంబరీషుండు జనియించె; నతని యందు జగ దప్రతిహతంబైన బ్రాహ్మణశాపంబు నిరర్థకం బయ్యె” ననిన విని “యేమి కారణంబున దురంతంబైన బ్రహ్మదండంబు వలన నతండు విడువంబడియె” ననిన నప్పుడమిఱేనికి శుకుం డిట్లనియె.

టీకా:

అంతన్ = ఆతరువాత; నాభాగున్ = నాభాగుని; కున్ = కి; అంబరీషుండు = అంబరీషుడు; జనియించెన్ = పుట్టెను; అతని = అతని; అందున్ = ఎడల; జగత్ = లోకమున; అప్రతిహతంబు = తిరుగులేనిది; ఐన = అయినట్టి; బ్రాహ్మణ = బ్రాహ్మణుని; శాపంబున్ = శాపముకూడ; నిరర్దకంబు = వ్యర్థమైనది; అయ్యెన్ = అయిపేయినది; అనినన్ = అనగా; విని = విని; ఏమి = ఎట్టి; కారణంబునన్ = కారణముచేత; దురంతంబు = దాటరానిది; ఐన = అయినట్టి; బ్రహ్మదండంబున్ = బ్రహ్మశాపము; వలనన్ = నుండి; అతండు = అతడు; విడువంబడియెన్ = తప్పించుకొనబడెను; అనినన్ = అనగా; ఆ = ఆ; పుడమిఱేని = రాజున; కిన్ = కు; శుకుండు = శుకుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

అటుపిమ్మట, నాభాగునికి అంబరీషుడు పుట్టాడు. బ్రాహ్మణ శాపం లోకంలో తిరుగులేనిది అంటారు. అంతటి శాపం కూడ అతని ఎడల వ్యర్థం అయిపోయింది.” అంటున్న శుకునితో పరీక్షిత్తు ఇలా అన్నాడు. “ఎందుచేత అంతటి దాటరాని బ్రహ్మణశాపం నుండి అతడు తప్పించుకొన గలిగాడు.” ఇలా అడిగిన ఆ రాజుతో శుకుడు ఇలా పలికాడు.