పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : ఉపోద్ఘాతము

  •  
  •  
  •  

9-2-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మహనీయ గుణగరిష్ఠులగు నమ్ముని శ్రేష్ఠులకు నిఖిలపురాణ వ్యాఖ్యాన వైఖరీ సమేతుండైన సూతుం డిట్లనియె; నట్లు ప్రాయోపవిష్టుం డయిన పరీక్షిన్నరేంద్రుండు శుకయోగీంద్రుం గనుంగొని.

టీకా:

మహనీయ = గొప్ప; గుణ = సుగుణములుతో; గరిష్ఠులు = శ్రేష్ఠులు; అగు = అయిన; ఆ = ఆ; ముని = మునులలో; శ్రేష్ఠులు = ఉత్తముల; కున్ = కు; నిఖిల = సమస్తమైన; పురాణ = పురాణములను; వ్యాఖ్యాన = వివరముగా చెప్పెడి; వైఖరీ = విధానము; సమేతుండు = కలిగనవాడు; ఐన = అయిన; సూతుండు = సూతుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; అట్లు = ఆ విధముగ; ప్రాయోపవిష్ఠుండు = ప్రాయోపవేశదీక్షగలవాడు {ప్రాయోపవేశము - ఆహారాదులను విడచి మరణమునకై వేచియుండుట}; అయిన = ఐనట్టి; పరీక్షిత్ = పరీక్షిత్తు యనెడి; నరేంద్రుండు = రాజు {నరేంద్రుడు - నరులకు ప్రభువు, రాజు}; శుక = శుకుడు యనెడి; యోగి = యోగులలో; ఇంద్రున్ = గొప్పవానిని; కనుంగొని = చూసి.

భావము:

గొప్ప గుణములు కలిగిన ఆ మునీశ్వరులతో అఖిల పురాణాలను వివరించటంలో నేర్పరి అయిన సూతమహర్షి ఇలా అన్నాడు. "ప్రాయోపవేశం చేసి ఉన్న పరీక్షిత్తు మహారాజు శుకమహర్షిని చూసి.