పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : మత్యావతార కథా ఫలసృతి

  •  
  •  
  •  

8-741-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ప్రయాంభోనిధిలోన మేన్మఱచి నిద్రంజెందు వాణీశు మో
ము వేదంబులుఁ గొన్న దైత్యుని మృతిం బొందించి సత్యవ్రతుం
రన్ బ్రహ్మము మాటలం దెలిపి సర్వాధారుఁడై మీనమై
ధిం గ్రుంకుచుఁ దేలుచున్ మెలఁగు రాన్మూర్తికిన్ మ్రొక్కెదన్.

టీకా:

ప్రళయ = ప్రళయకాలమున; అంభోనిధి = సముద్రము; లోనన్ = అందు; మేన్మఱచి = మైమరచి; నిద్రంజెందు = నిద్రపోయెడి; వాణీశు = బ్రహ్మదేవుని; మోములన్ = ముఖములనుండి; వేదంబులున్ = వేదములను; కొన్న = సంగ్రహించిన; దైత్యుని = రాక్షసుని; మృతింబొందించి = సంహరించి; సత్యవ్రతుండు = సత్యవ్రతుడు; అలరన్ = సంతోషించునట్లు; బ్రహ్మమున్ = పరబ్రహ్మ; మాటలన్ = జ్ఞానమును; తెలిపి = తెలియజేసి; సర్వ = సమస్తమునకు; ఆధారుడు = ఆధారమైనవాడు; ఐ = అయ్యి; మీనము = మత్స్యావతారుడు; ఐ = అయ్యి; జలధిన్ = సముద్రమున; క్రుంకుచున్ = ములుగుతూ; తేలుచున్ = తేలుతూ; మెలగు = తిరిగెడి; రాజన్మూర్తి = మహారూపి, విష్ణుమూర్తి; కిన్ = కి; మ్రొక్కెదన్ = నమస్కరించెదను.

భావము:

ప్రళయసముద్రంలో మైమరచి నిద్రించే బ్రహ్మదేవుడి ముఖాల నుండి వెలువడిన వేదాలను దొంగిలించిన దుష్టరాక్షసుడిని సంహరించి, సత్యవ్రతుడు సంతోషించేటట్లు బ్రహ్మస్వరూపాన్ని తెలిపి, అన్నింటికి ఆధారుడవు అయి, మత్స్యావతారంతో సముద్రంలో మునుగుతూ తేలుతూ సంచారం చేసిన మహావిష్ణువునకు నమస్కారం చేస్తున్నాను.”