పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : మత్యావతార కథా ఫలసృతి

  •  
  •  
  •  

8-739-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నవిభుండు దపసి త్యవ్రతుండును
త్స్యరూపి యైన మాధవుండు
సంచరించినట్టి దమలాఖ్యానంబు
వినిన వాఁడు బంధ విరహితుండు.

టీకా:

జనవిభుండున్ = రాజు {జనవిభుడు - జనుల ప్రభువు, రాజు}; తపసి = ఋషి; సత్యవ్రతుండునున్ = సత్యవ్రతుడు; మత్స్యరూపి = మత్స్యావతారుడు; ఐన = అయిన; మాధవుండు = విష్ణువు {మాధవుడు - మాధవి (లక్ష్మీదేవి) భర్త, హరి}; సంచరించిన = మెలగిన; సత్ = మంచి; అమల = స్వచ్ఛమైన; ఆఖ్యానంబున్ = కథను; వినినన్ = విన్న; వాడు = అతడు; బంధవిరహితుండు = భవబంధవిముక్తైనవాడు.

భావము:

రాజఋషియైన సత్యవ్రతుడి భక్తిని; మత్స్యావతారం ధరించిన శ్రీ మహావిష్ణువు మహిమనూ; ప్రకటించే ఈ పుణ్య చరిత్రను విన్నవాడు సంసారబంధాల నుంచి విముక్తుడు అవుతాడు.