పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : త్రికూట మందలి గజములు

  •  
  •  
  •  

8-26-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

న్యాలోకన భీకరంబులు, జితాశానేకపానీకముల్,
న్యేభంబులు కొన్ని మత్తతనులై, వ్రజ్యావిహారాగతో
న్యత్వంబున భూరి భూధరదరీ ద్వారంబులందుండి సౌ
న్యక్రీడల నీరుగాలిపడి కాసారావగాహార్థమై.

టీకా:

అన్య = ఇతరులకు; ఆలోకన = చూచుటకు; భీకరంబులు = భయముగొల్పునవి; జిత = జయింపబడిన; ఆశా = దిక్కులు గల; అనేకప = ఏనుగుల; అనీకముల్ = గుంపు లందలి; వన్య = అడవి; ఇభంబులు = ఏనుగులు; కొన్ని = కొన్ని; మత్త = మదించిన; తనులు = శరీరములు గలవి; ఐ = అయ్యి; వ్రజ్యా = మందలో; విహార = విహరించుటచే; ఆగత = వచ్చిన; ఉదన్యత్వంబునన్ = దప్పికతో; భూరి = మహాగొప్ప; భూధర = పర్వతముల; దరీ = గుహా; ద్వారంబుల = ద్వారములలో; ఉండి = ఉండి; సౌజన్యక్రీడలన్ = సయ్యాటలలో; నీరుగాలి = నీటిగాలికి; పడి = వశములై; కాసార = చెరువులో; అవగాహ = మునుగుటల; అర్థమై = కోసమై.

భావము:

ఆ అడవిలోని ఏనుగులు ఇతరులు కన్నెత్తి చూడలేనంత భయంకరమైనవి. అవి మదించిన తమ శరీరాలతో దిగ్గజాలను సైతం మించినవి. వాటిలో కొన్ని కొండగుహల నుండి బయలు దేరాయి. చెర్లాటాలు ఆడుతు దప్పి గొన్నాయి. జల క్రీడల కోసం సరస్సులవైపు నీటిగాలి వాలు పట్టి నడిచాయి.
రహస్యార్థం -అభయం అయిన సమాధిలో యోగులు (ద్వైతులు) భయం కల్పించుకొని దుర్ణిరీక్షణం అని చెప్పదగ్గ కూటస్థాది చైతన్య రూప ఏనుగులు. మూలాధారాది గుహల నుండి బయలుదేరి పరాగ్దృష్టులకు భయంకరములై దిగ్దేవతలగు ఇంద్రాదులను జయించునవై సంచరిస్తున్నాయి. కర్మాది, అభాస సుఖాలైన విలాసేచ్ఛలచే క్షుత్పిపాసాది షడూర్ముల స్థానమగు మనస్సు అను కాసారం (సరస్సు) కోసం బయలు దేరాయి. (ఆకలి దప్పులు, శోక మోహములు, జరామరణములు షడూర్ములు)