పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : బలియఙ్ఞమును విస్తరించుట

  •  
  •  
  •  

8-678-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"మిఁ గొఱత పడియె నీతని జన్నంబు
విస్తరింపు కడమ విప్రవర్య!
విషమ మయిన కర్మ విసరంబు బ్రాహ్మణ
నులు చూచినంత మతఁ బొందు."

టీకా:

ఏమిన్ = ఏదైతే; కొఱతపడియెన్ = ఇంకామిగిలి ఉన్నదో; ఈతని = ఇతని యొక్క; జన్నంబు = యజ్ఞము; విస్తరింపు = నెరవేర్చుము; కడమ = మిగిలినదంతా; విప్ర = బ్రాహ్మణులలో; వర్య = శ్రేష్ఠుడా; విషమము = సరిగా పూర్తికానిది; అయిన = ఐన; కర్మ = కార్యక్రమముల; విసరంబున్ = సమూహమును; బ్రాహ్మణ = బ్రాహ్మణులైన; జనులు = వారు; చూచిన = చూసిన; అంతన్ = అంతమాత్రముచేత; సమతన్ = సఫలతను; పొందున్ = పొందును.

భావము:

“శుక్రాచార్యా! విప్రోత్తమా! బలిచక్రవర్తి యజ్ఞంలో మిగిలిన కార్యాన్ని నెరవేర్చు లోపం ఏమాత్రం రాకూడదు. ఆగిపోయిన యజ్ఞకార్యాలు మీవంటి బ్రహ్మవేత్తలవల్ల సఫలమవుతాయి.”