పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : హిరణ్యగ ర్భాగమనము

  •  
  •  
  •  

8-662-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ద్ధుండై గురుశాపతప్తుఁడయి తా బంధువ్రజత్యక్తుఁడై
సిద్ధైశ్వర్యముఁ గోలుపోయి విభవక్షీణుండునై పేదయై
శుద్ధత్వంబును సత్యముం గరుణయున్ సొంపేమియుం దప్పఁ డు
ద్బుద్ధుండై యజయాఖ్యమాయ గెలిచెం బుణ్యుం డితం డల్పుఁడే.

టీకా:

బద్ధుండు = బంధింపబడినవాడు; ఐ = అయ్యి; గురు = గురువు యొక్క; శాప = శాపమువలన; తప్తుడు = తపించువాడు; అయి = ఐ; తాన్ = అతను; బంధు = బంధువుల; వ్రజ = సమూహములచే; త్యక్తుడు = విడువబడినవాడు; ఐ = అయ్యి; సిద్ధ = ప్రాప్తించిన; ఐశ్వర్యమున్ = సంపదలు; కోలుపోయి = నశించి; విభవ = ప్రాభవములు; క్షీణుండున్ = నశించినవాడు; ఐ = అయ్యి; పేద = పేదవాడు; ఐ = అయ్యి; శుద్ధత్వంబునన్ = స్వచ్ఛతను; సత్యమున్ = సత్యమును; కరుణయున్ = దయను; సొంపున్ = ప్రసన్నతలను; ఏమియున్ = ఏమాత్రము; తప్పడు = విడువలేదు; ఉద్బుద్ధుండు = జ్ఞాని; ఐ = అయ్యి; అజయ = అజయ (గెలువసాధ్యముకాని); ఆఖ్యన్ = పేరుకలిగిన; మాయన్ = మాయను; గెలిచెన్ = జయించెను; పుణ్యుడు = పుణ్యాత్ముడు; ఇతడు = ఇతగాడు; అల్పుడే = తక్కువవాడా కాదు.

భావము:

ఈ పుణ్యాత్ముడు బంధింపబడ్డాడు. గురువు శాపంవలన పరితాపానికి గురయ్యాడు. బంధువులనుండి విడువబడ్డాడు. ప్రాప్తించిన అధికారాన్ని ఐశ్వర్యాన్నీ కోల్పోయి పేదవాడు అయ్యాడు. ఐనా నిర్మలంగా ఉన్నాడు. సత్యాన్ని దయనూ సన్మార్గాన్ని వదలకుండా ఉన్నాడు. జ్ఞానియై గెలవడానికి సాధ్యంకాని అజయ అని పేరు పడ్డ మాయను గెలిచాడు. ఇతడు చాలా గొప్ప మహానీయుడు.