పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : ప్రహ్లా దాగమనము

  •  
  •  
  •  

8-654-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మత్తద్విపయాన యై కుచ నిరుంచ్ఛోళ సంవ్యానయై
ధృ భాష్పాంబు వితాన యై కరయుగాధీ నాలికస్థానయై
తిభిక్షాం మమ దేహి కోమలమతే! ద్మాపతే!” యంచుఁ ద
త్సతి వింధ్యావళి చేరవచ్చెఁ ద్రిజగద్రక్షామనున్ వామనున్.

టీకా:

తత్ = ఆ; మత్త = మదించిన; ద్విప = గజమువంటి; యాన = గమనము గలయామె; ఐ = అయ్యి; కుచ = వక్షస్థలమును; నిరుంధత్ = గట్టిగా; చోళ = పైటచెరగు; సంవ్యాన = చుట్టకొన్నామె; ఐ = అయ్యి; ధృత = కారిన; భాష్పాంబు = కన్నీటి; వితాన = సమూహములు కలామె; ఐ = అయ్యి; కర = చేతులు; యుగా = రెండును; అధీన = ఆయత్తము చేసిన; అలికస్థాన = నుదుటిప్రదేశము కలామె; ఐ = అయ్యి; పతి = భర్త అను; భిక్షాన్ = భిక్షను; మమ = నాకు; దేహి = పెట్టుము; కోమలమతే = మృదువైన మనసు కలవాడ; పద్మాపతే = లక్ష్మీపతీ; అంచున్ = అనుచు; తత్ = ఆ; సతి = ఇల్లాలు; వింధ్యావళి = వింధ్యావళి; చేరన్ = దగ్గరకు; వచ్చెన్ = వచ్చెను; త్రిజగత్ = ముల్లోకములను; రక్ష = కాపాడుట; ఆమనున్ = సమృద్ధిగా కలవానిని; వామనున్ = వామనుని.

భావము:

ఆసమయంలో బలిచక్రవర్తి భార్య వింధ్యావళి కన్నీరు కారుస్తూ మందగమనంతో అచ్చటికి వచ్చింది. ఆమె వక్షస్థలం నిండా గట్టిగా పైట చెరగు బిగించుకుని ఉంది. రెండుచేతులనూ నుదిటిపై జోడించి “దయామయా! లక్ష్మీపతీ! నాకు పతిభిక్షపెట్టు” అంటూ ముల్లోకాలకూ ప్రభువైన వామనమూర్తిని వేడుకున్నది.