పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : ప్రహ్లా దాగమనము

  •  
  •  
  •  

8-653-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని పలికి జగదీశ్వరుండును నిఖిలలోక సాక్షియు నగు నారాయణ దేవునకు నమస్కరించి, ప్రహ్లాదుండు పలుకుచున్న సమయంబున.

టీకా:

అని = అని; పలికి = పలికి; జగత్ = లోకములకు; అధీశ్వరుండును = ప్రభువు; నిఖిల = సమస్తమైన; లోక = లోకములకు; సాక్షియున్ = దర్శనుండు; అగు = అయిన; నారాయణ = విష్ణువు యనెడి; దేవున్ = దేవుని; కున్ = కి; నమస్కరించి = నమస్కారముచేసి; ప్రహ్లాదుండు = ప్రహ్లాదుడు; పలుకుచున్న = పలుకుతున్నట్టి; సమయంబునన్ = సమయమునందు;

భావము:

లోకనాథుడూ లోకదర్శకుడూ అయిన విష్ణుదేవునకు ప్రహ్లాదుడు నమస్కరించి అలా పలుకుతున్న సమయములో.