పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : వామనునికి దాన మిచ్చుట

  •  
  •  
  •  

8-607-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణుస్వరూపాయ వే
ప్రామాణ్యవిదే త్రిపాద ధరణిం దాస్యామి!" యంచుం గ్రియా
క్షిప్రుండై దనుజేశ్వరుండు వడుగుం జే సాఁచి పూజించి "బ్ర
హ్మప్రీత"మ్మని ధారపోసె భువనం బాశ్చర్యముం బొందగన్.

టీకా:

విప్రాయ = బ్రాహ్మణునికొఱకు; ప్రకటవ్రతాయ = ప్రసిద్ధమైన నిష్ఠ కలవానికొఱకు; భవతే = నీకొఱకు; విష్ణుస్వరూపాయ = విష్ణుమూర్తి యొక్క స్వరూపునికొఱకు; వేదప్రామాణ్యవిదే = వేదములందలి ప్రమాణములచే తెలియబడువానికొఱకు; త్రి = మూడు (3); పాద = అడుగుల; ధరణిన్ = భూమిని; దాస్యామి = దానముచేయుచుంటిని; అంచున్ = అనుచు; క్రియాక్షిప్రుండు = పనియందు త్వరకలవాడు; ఐ = అయ్యి; దనుజేశ్వరుండు = రాక్షసరాజు; వడుగున్ = బ్రహ్మచారిని; చేన్ = చేయి; చాచి = చాచి; పూజించి = పూజచేసి; బ్రహ్మ = పరబ్రహ్మకి; ప్రీతమ్ము = ప్రీతికలుగగాక; అని = అని; ధారపోసె = ధారపోసెను {ధారపోయు - దానముచేయుట, దానముచేసెడి క్రియలో నీటిధారను దాత చేతినుండి గ్రహీత చేతిలో పడునట్లు పోసెడి విధి}; భువనంబు = జగత్తంతా; ఆశ్చర్యంబున్ = ఆశ్చర్యము; పొందగన్ = పడునట్లుగా.

భావము:

బలిచక్రవర్తి చేతులు చాచి వామనుడిని పూజించాడు. “బ్రాహ్మణుడవూ; ప్రసిద్ధమైన వ్రతం కలవాడవు; విష్ణు స్వరూపుడవూ; వేదాల నియమాలు తెలిసినవాడవూ; అయిన నీకు మూడడుగుల నేల దానం చేస్తున్నాను.” అని పలికి “పరమాత్మునకు ప్రీతి కలుగుగాక.” అంటూ వెనువెంటనే ధారపోసాడు. అదిచూసి విశ్వం అంతా ఆశ్చర్యపోయింది.బలిచక్రవర్తి చేతులు సాచి వామనుడిని పూజించాడు. “బ్రాహ్మణునికి; ప్రకటమైన వ్రతం కలవానికి; విష్ణు స్వరూపునికి; వేదప్రమాణాలచే తెలియబడువానికి; నీకు మూడడుగుల నేల దానం చేస్తున్నాను.” అని పలికి త్వరత్వరగా “పరమాత్మునకు ప్రీతి కలుగుగాక.” అంటూ ధారపోసాడు. అదిచూసి విశ్వం అంతా ఆశ్చర్యపోయింది.