పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : వామనునికి దాన మిచ్చుట

  •  
  •  
  •  

8-604-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లి దైత్యేంద్ర కరద్వయీ కృత జలప్రక్షాళనవ్యాప్తికిన్
జాతాక్షుఁడు చాఁచె యోగి సుమనస్సంప్రార్థితశ్రీదముం
లితానమ్ర రమా లలాటపదవీ స్తూరికా శాదమున్
లినామోదము రత్ననూపురిత నానావేదముం బాదమున్.

టీకా:

బలిదైత్యేంద్ర = బలిచక్రవర్తి; కర = చేతులు; ద్వయీ = రెంటి (2) తోను; కృత = చేయు; జల = నీటితో; ప్రక్షాళన = కడుగుట; వ్యాప్తికిన్ = జరుగుటకు; జలజాతాక్షుడు = విష్ణువు {జలజాతాక్షుడు - జలజాత (పద్మములవంటి) అక్షుడు (కన్నులు కలవాడు), విష్ణువు}; చాచెన్ = చాచెను; యోగి = యోగులచేత; సుమనస్ = దేవతలచేత; సంప్రార్థిత = చక్కగా సేవింపబడెడి; శ్రీ = శుభములను; దమున్ = కలిగించెడిది; కలిత = కలిగిన; ఆనమ్ర = వంగినట్టి; రమా = లక్ష్మీదేవి; లలాట = నుదుట; పదవీ = ఉన్న; కస్తూరికా = కస్తూరితిలకము; శాదము = పంకముకలది; నలిన = పద్మముల; ఆమోదమున్ = పరిమళము కలది; రత్న = మణులుపొదిగిన; నూపురిత = అందెలు కలగిన; నానా = సమస్త; వేదమున్ = వేదములునునైనది; పాదమున్ = పాదమును.

భావము:

బలిచక్రవర్తి తన రెండు చేతులతోనూ కడగడానికి అనువుగా వామనుడు తన పాదాన్ని సాచాడు. ఆ పాదం యోగులూ, దేవతలూ సేవించునది, వారు కోరుకొనే సంపదలను సమకూర్చునది; భక్తితో వంగిన లక్ష్మిదేవి నొసటి మీది కస్తూరి కుంకుమతో కూడినది; పద్మాల పరిమళం గుబాళించునది; ఆ పాదం వేదాలరాశి అనే మణిమంజీరాలు అలంకరించుకున్నది.