పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : పయోభక్షణ వ్రతము

  •  
  •  
  •  

8-479-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"నారాయణుఁ బరమేశ్వరు
నేరీతిఁ దలంతు? మంత్ర మెయ్యది? విహితా
చారంబు లే ప్రకారము?
లారాధన కాల మెద్ది? యానతి యీవే. "

టీకా:

నారాయణున్ = శ్రీమహావిష్ణువును {నారాయణుడు - అవతారములందు నరసంబంధమయిన శరీరమును పొందువాడు, విష్ణువు}; పరమేశ్వరున్ = శ్రీమహావిష్ణువును {పరమేశ్వరుడు - పరమ (అత్యున్నతమైన) ఈశ్వరుడు (దేముడు), విష్ణువు}; ఏ = ఏ; రీతిన్ = విధముగ; తలంతున్ = ధ్యానించవలెను; మంత్రమున్ = పఠించవలసిన మంత్రము; ఎయ్యది = ఏది; విహిత = విధింపబడిన; ఆచారములు = నియమములు; ఏ = ఎట్టి; ప్రకారాములు = విధమైనవి; ఆరాధన = కొలచెడి; కాలము = సమయము; ఎద్ది = ఏది; ఆనతి = సెలవు; ఈవే = ఇమ్ము.

భావము:

“స్వామీ! పరమాత్ముడైన శ్రీమహావిష్ణువును ఏవిధంగా ధ్యానించాలి. అందుకు తగిన మంత్రమేది. దాని నియమాలు ఏవి. పూజింప వలసిన కాలమేది. అన్నీ నాకు ఉపదేశించు.”.