పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : 14ఇంద్రసావర్ణిమనువు చరిత్ర

  •  
  •  
  •  

8-433.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గిది ధర్మంబు నాలుగు పాదములను
లిగి వర్తిల్లు; మనువులు మల నేత్రు
నాజ్ఞఁ దిరుగుదు; రేలుదు వని పతులు
గతి భాగించి తమతమ మయములను.

టీకా:

మనువులున్ = మనువులు; మునులును = మునులు; మను = మునువుల యొక్క; సుతులున్ = పుత్రులు; ఇంద్రులు = ఇంద్రులు; అమరులు = దేవతలు; హరి = నారాయణుని; ఆజ్ఞన్ = ఆజ్ఞను; అడగు = లోబడి యుండెడి; వారు = వారు; ఆ = ఆ; యజ్ఞ = యజ్ఞుడు; ఆదులున్ = మున్నగువారు; అందఱున్ = అందరు; హరి = నారాయణుని; పౌరుష = అంశతో; ఆకృతులు = రూపుదాల్చినవారు; ఆ = ఆ; మనువులున్ = మనువు; తత్ = అతని యొక్క; సహాయ = సహాయము యనెడి; శక్తి = బలమువలన; జగములన్ = లోకములను; నడుపుదురు = పరిపాలించెదరు; ఒగిన్ = క్రమముగా; నాల్గు = నాలుగు (4); యుగముల = యుగముల; కడపటన్ = చివర; కాల = కాలముచేత; సంగ్రస్తము = మింగబడినవి; ఐన = అయిన; నిగమ = వేదముల; చయంబునున్ = సమూహములను; నిజ = తమ; తపస్ = తపస్సుల యొక్క; బలములన్ = శక్తిచేత; మరలన్ = మళ్ళీ; కాంతురు = దర్శించెదరు; ఋషి = ఋషులలో; వరులు = శ్రేష్ఠులు; తొంటిన్ = పూర్వము.
పగిదిన్ = వలె; ధర్మంబున్ = ధర్మమును; నాలుగు = నాలుగు (4); పాదములను = పాదములు; కలిగి = పొంది; వర్తిల్లున్ = నడచును; మనువులున్ = మనువులు; కమలనేత్రున్ = విష్ణునియొక్క; ఆజ్ఞన్ = ఆజ్ఞప్రకారముగ; తిరుగుదురు = వర్తించెదరు; ఏలుదురు = పరిపాలించెదురు; అవనిపతులు = రాజులు; జగతిన్ = లోకములు; భాగించి = పంచుకొని; తమతమ = వారివారి; సమయములను = సమయములందు.

భావము:

మనువులూ, ఋషులూ, మనువుల కొడుకులూ, ఇంద్రులూ, దేవతలూ విష్ణుదేవుని ఆజ్ఞకు లోబడి ఉంటారు. యజ్ఞుడు మొదలైనవారు అందరూ విష్ణుదేవుని అంశముతో రూపు దాలుస్తారు. అతని సహయంవల్ల మనువులు లోకాలను ఏలుతారు. క్రమంగా నాలుగు యుగాల చివర వేదాలను కాలం మ్రింగేస్తుంది. పుణ్యాత్ములైన ఋషులు తమ తపశ్శక్తి వలన మరల వేదాలను దర్శిస్తారు. పూర్వం వలె ధర్మం నాలుగు పాదాలతో నడుస్తుంది. విష్ణువు ఆజ్ఞ చెల్లుబడి అవుతుంది. తమతమ కాలాలలో రాజులు లోకాన్ని పంచుకుని పాలిస్తారు.