అష్టమ స్కంధము : 14ఇంద్రసావర్ణిమనువు చరిత్ర
- ఉపకరణాలు:
జగతీశ! త్రికాలములనుఁ
బొగడొందు మనుప్రకారములు చెప్పఁబడెం;
దగఁ బదునలువురు మనువులుఁ
దెగ యుగములు వేయు నడవ దివ మజున కగున్."
టీకా:
జగతీశ = రాజా; త్రికాలములనున్ = త్రికాలములందు; పొగడొందు = స్తుతింపబడెడి; మను = మనువులయొక్క; ప్రకారములు = విధానములు; చెప్పంబడెన్ = చెప్పబడినవి; తగన్ = చక్కగా; పదునలువురున్ = పద్నాలుగుమంది (14); మనువులున్ = మనువులు; తెగన్ = అంతరించిపోగ; యుగములు = యుగములు; వేయు = వెయ్యి; నడవన్ = గడవగా; దివము = దినము; అజున్ = బ్రహ్మదేవున; కున్ = కు; అగున్ = అగును.
భావము:
ఓ రాజా! మూడు లోకాలలోనూ ప్రఖ్యాతి పొందే మనువుల విధానాన్ని చెప్పాను. పద్నాలుగుమంది మనువులు అంతరించి వెయ్యి యుగాలు గడిస్తే బ్రహ్మకు ఒకదినం అవుతుంది.” అని శుకుడు చెప్పగా పరీక్షిత్తు ఇలా అన్నాడు.