పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : 14ఇంద్రసావర్ణిమనువు చరిత్ర

  •  
  •  
  •  

8-429-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తీశ! త్రికాలములనుఁ
బొడొందు మనుప్రకారములు చెప్పఁబడెం;
గఁ బదునలువురు మనువులుఁ
దె యుగములు వేయు నడవ దివ మజున కగున్."

టీకా:

జగతీశ = రాజా; త్రికాలములనున్ = త్రికాలములందు; పొగడొందు = స్తుతింపబడెడి; మను = మనువులయొక్క; ప్రకారములు = విధానములు; చెప్పంబడెన్ = చెప్పబడినవి; తగన్ = చక్కగా; పదునలువురున్ = పద్నాలుగుమంది (14); మనువులున్ = మనువులు; తెగన్ = అంతరించిపోగ; యుగములు = యుగములు; వేయు = వెయ్యి; నడవన్ = గడవగా; దివము = దినము; అజున్ = బ్రహ్మదేవున; కున్ = కు; అగున్ = అగును.

భావము:

ఓ రాజా! మూడు లోకాలలోనూ ప్రఖ్యాతి పొందే మనువుల విధానాన్ని చెప్పాను. పద్నాలుగుమంది మనువులు అంతరించి వెయ్యి యుగాలు గడిస్తే బ్రహ్మకు ఒకదినం అవుతుంది.” అని శుకుడు చెప్పగా పరీక్షిత్తు ఇలా అన్నాడు.