పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : 10బ్రహ్మసావర్ణిమనువు చరిత్ర

  •  
  •  
  •  

8-419-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు నుపశ్లోక సుతుం డగు బ్రహ్మసావర్ణి దశమ మనువయ్యెడి; తత్పుత్రులు భూరిషేణాదులు భూపతులును; హవిష్మత్ప్రముఖులు మునులును; శంభుం డను వాఁ డింద్రుండును; విబుద్ధ్యాదులు నిర్జరులును నయ్యెద; రందు.

టీకా:

మఱియును = ఇంకను; ఉపశ్లోక = ఉపశ్లోకుని; సుతుండు = కుమారుడు; అగు = అయిన; బ్రహ్మసావర్ణి = బ్రహ్మసావర్ణి; దశమ = పదవ (10); మనువున్ = మనువు; అయ్యెడిన్ = అవుతాడు; తత్ = అతని; పుత్రులు = పుత్రులు; భూరిషేణ = భూరిషేణుడు; ఆదులు = మున్నగువారు; భూపతులును = రాజులు; హవిష్మత్ = హవిష్మంతుడు; ప్రముఖులు = మున్నగువారు; మునులును = మునులు; శంభుండు = శంభుడు; అను = అనెడి; వాడు = వాడు; ఇంద్రుండును = ఇంద్రుడు; విబుద్ధి = విబుద్ధి; ఆదులు = మున్నగువారు; నిర్జరులును = దేవతలు; అయ్యెదరు = అవుతారు; అందు = ఆ కాలమున.

భావము:

పరీక్షిత్తుమహారాజా! అటు పిమ్మట ఉపశ్లోకుడి కొడుకైన బ్రహ్మసావర్ణి పదవ మనువు అవుతాడు. అతని కొడుకులైన భూరిషేణుడు మొదలైనవారు రాజులు అవుతారు. హవిష్మంతుడు మొదలైనవారు ఋషులు అవుతారు. శంభుడు అనేవాడు ఇంద్రుడు అవుతాడు. విబుద్ధి మొదలైనవారు దేవతలు అవుతారు