పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : నముచి వృత్తాంతము

  •  
  •  
  •  

8-374-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కాశంబున వచ్చు శూలమును జంభారాతి ఖండించి నా
నా కాండంబుల వాని కంఠము దెగన్ దంభోళియున్ వైచె న
స్తోకేంద్రాయుధమున్ సురారిగళముంద్రుంపంగ లేదయ్యె; వా
డాకంపింపక నిల్చె దేవవిభుఁ డత్యాశ్చర్యముం బొందఁగన్.

టీకా:

ఆకాశంబునన్ = ఆకాశములో; వచ్చు = వచ్చుచున్న; శూలమున్ = శూలమును; జంభారాతి = ఇంద్రుడు; ఖండించి = ముక్కలుచేసి; నానా = అనేకమైన; కాండంబులన్ = బాణములతో; వాని = అతని; కంఠమున్ = కంఠము; తెగన్ = తెగిపోవునట్లు; దంభోళియున్ = వజ్రాయుధమును; వైచెన్ = వేసెను; అస్తోక = బలమైన; ఇంద్ర = ఇంద్రుని; ఆయుధమున్ = ఆయుధముకూడ; సురారి = రాక్షసుని; గళమున్ = గొంతును; త్రుంపగన్ = తెంప; లేదయ్యె = లేకపోయినది; వాడు = అతడు; ఆకంపింపక = చలింపకుండగ; నిల్చెన్ = నిలబడెను; దేవవిభుడు = ఇంద్రుడు; అతి = మిక్కిలి; ఆశ్చర్యమున్ = ఆశ్చర్య; పొందగన్ = పడిపోయెను.

భావము:

నముచి విసిరిన శూలం ఆకాశంలో వస్తుండగానే, ఇంద్రుడు దానిని ఖండించాడు. నముచి తల నరకడానికి అనేకమైన బాణాలు వేశాడు, వజ్రాయుధం ప్రయోగించాడు. కానీ నముచి తలను వజ్రాయుధం సైతం ఖండించ లేకపోయింది. నముచి చలించకుండా నిలబడి ఉండడం చూసి దేవతల ప్రభువు అయిన ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు.