పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : బలి ప్రతాపము

  •  
  •  
  •  

8-338-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సురేంద్రుని బహుతర
మాయాజాలంబులకును మా ఱెఱుఁగక వ
జ్రాయుధ ముఖరాదిత్యుల
పాయంబును బొంది చిక్కుడిరి నరేంద్రా!

టీకా:

ఆ = ఆ; అసురేంద్రుని = రాక్షసరాజు యొక్క; బహుతర = చాలా ఎక్కువ యైన; మాయా = మాయల; జాలంబుల్ = సమూహముల; కునున్ = కు; మాఱు = విరుగుడు; ఎఱుగక = తెలియక; వజ్రాయుధ = ఇంద్రుడు; ముఖర = మొదలగు; ఆదిత్యులు = ద్వాదశాదిత్యులు; అపాయంబునున్ = ఆపదలు; పొంది = పొంది; చిక్కుపడిరి = చిక్కులపాలైరి; నరేంద్ర = రాజా.

భావము:

ఓ పరీక్షిన్మహారాజా! ఆ రాక్షస రాజేంద్రుడు బలి పన్నిన రకరకాల మాయా జాలాలకు విరుగుడు తెలియని వజ్రాయుధధారి అయిన ఇంద్రుడు మున్నగు ఆదిత్యులు దిక్కుతోచక చిక్కులలో పడ్డారు.