పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : లక్ష్మీదేవి హరిని వరించుట

  •  
  •  
  •  

8-289-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పాలవెల్లి కూఁతురు
దీపుల చూపులను దోఁగి తిలకింపఁ బ్రజల్
చేట్టిరి సంపదలనుఁ;
బ్రాపించెను మేలు; జగము బ్రతికె నరేంద్రా!

టీకా:

ఆ = ఆ; పాలవెల్లికూతురున్ = లక్ష్మీదేవి; తీపుల = మాధుర్యముల; చూపులన్ = చూపులందు; తోగి = తడిపి; తిలకింపన్ = చూడగా; ప్రజల్ = లోకులు; చేపట్టిరి = పొందిరి; సంపదలన్ = సంపదలను; ప్రాపించెను = సమకూరెను; మేలు = శుభములు; జగమున్ = భువనములు; బ్రతికెన్ = సుస్థితినిపొందినవి; నరేంద్రా = రాజా.

భావము:

పరీక్షిన్మహారాజా! ఆ సముద్ర రాజపుత్రి లక్ష్మీదేవి చల్లని చూపులతో తియ్యగా చూసింది. ప్రజలకు సంపదలు చేకూరాయి, శుభాలు సమకూరాయి. జగత్తు సుఖజీవనంతో జీవించింది.