పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : గరళ భక్షణము

  •  
  •  
  •  

8-245-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రము లోకంబులకును
నం బగు టెఱిఁగి శివుఁడు టుల విషాగ్నిం
గుదురుకొనఁ గంఠబిలమున
దిలంబుగ నిలిపె సూక్ష్మలరసము క్రియన్.

టీకా:

ఉదరము = కడుపు; లోకంబుల్ = లోకముల; కును = కు; సదనంబు = నివాసము; అగుటన్ = అయ్య ఉండుటను; ఎఱిగి = తెలిసి; శివుడు = శంకరుడు; చటుల = భయంకరమైన; విష = విషము యొక్క; అగ్నిన్ = అగ్నిని; కుదురుకొనగన్ = కుదురుగానుండునట్లు; కంఠ = గొంతు యనెడి; బిలమునన్ = గుహ యందు; పదిలంబుగా = జాగ్రత్తగా; నిలిపెన్ = కదలకుండ ఉంచెను; సూక్ష్మ = చిన్న; ఫలరసము = పండురసము; క్రియన్ = వలె.

భావము:

పరమేశ్వరుడి ఉదరం సమస్త లోకాలకూ నివాసం కనుక. ఆయన ఆ భీకరమైన విషాగ్నిని ఉదరంలోనికి పోనివ్వకుండా, ఏదో చిన్న పండును ఉంచుకున్నట్లుగా, తన కంఠ బిలంలో కుదురుగా ఉండేలా జాగ్రత్తగా నిలుపుకున్నాడు.