పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : గరళ భక్షణము

  •  
  •  
  •  

8-238-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని పలికిన ప్రాణవల్లభునకు వల్లభ "దేవా! దేవర చిత్తంబు కొలంది నవధరింతురు గాక!" యని పలికె" నని చెప్పిన యమ్మునీంద్రునకు నరేంద్రుం డిట్లనియె.

టీకా:

అని = అని; పలికిన = అనిన; ప్రాణవల్లభున్ = భర్త; కున్ = కు; వల్లభ = భార్య; దేవా = దేవా; దేవర = ప్రభువు యొక్క; చిత్తంబు = మనసు; కొలందిన్ = ప్రకారము; అవధరింతుగాక = ధరింతురుగాక; అని = అని; పలికెన్ = అనెను; అని = అని; చెప్పిన = పలుకగా; ఆ = ఆ; ముని = మునులలో; ఇంద్రున్ = ఉత్తమున; కున్ = కు; నరేంద్రుడు = రాజు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఇలా “హాలాహలం మింగుతాను” అంటున్న తన భర్త అయిన భవునితో, ప్రియభార్య భవానీదేవి ఇలా అంటోంది. “స్వామీ! మీ మనస్సుకు తగినట్లు చేయండి.” ఇలా చెప్తున్న శుక మహర్షితో పరీక్షిన్మహారాజు ఇలా అడిగాడు.