పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : శివుని గరళ భక్షణకై వేడుట

  •  
  •  
  •  

8-221-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అప్పుడు భోగిభూషణునకు సాష్టాంగ దండప్రణామంబులు గావించి ప్రజాపతి ముఖ్యు లిట్లని స్తుతించిరి.

టీకా:

అప్పుడు = అప్పుడు; భోగిభూషణున్ = పరమశివుని {భోగిభూషణుడు - భోగి (పాము)లను భూషణుడు (అలంకారముగాగలవాడు), శివుడు}; కున్ = కి; సాష్టాంగదండప్రణామంబులు = సాగిలపడినమస్కారములు; కావించి = చేసి; ప్రజాపతి = బ్రహ్మదేవుడు; ముఖ్యుల్ = మున్నగువారు; ఇట్లు = ఈ విధముగ; అని = అని; స్తుతించిరి = స్తోత్రముచేసిరి.

భావము:

అలా అవసరమిచ్చిన సర్పాలంకార భూషితుడైన శంకరునకు, బ్రహ్మ మొదలైన దేవతలు అందరూ సాగిలపడి నమస్కారాలు చేసి ఇలా ప్రార్థించారు.