పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : శివుని గరళ భక్షణకై వేడుట

  •  
  •  
  •  

8-220-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వాలు దీనత వచ్చుటఁ
గూరిమితో నెఱిఁగి దక్షుకూఁతురుఁ దానుం
బేరోలగమున నుండి ద
యాతుఁడై చంద్రచూడుఁ వసర మిచ్చెన్.

టీకా:

వారలు = వారు; దీనతన్ = ఆర్తితో; వచ్చుటన్ = వచ్చుటను; కూరిమి = ప్రేమ; తోన్ = తోటి; ఎఱిగి = తెలిసికొని; దక్షుకూతురున్ = సతీదేవి {దక్షు కూతురు - దక్షుని కూతురు, సతి}; తానున్ = తను; పేరోలగమున = నిండుసభతీరి; ఉండి = ఉండి; దయా = కనికరించుట యందు; రతుడు = ప్రీతిగలవాడు; ఐ = అయ్యి; చంద్రచూడుడు = పరమశివుడు {చంద్రచూడుడు - చంద్రకళ చూడామణిగా కలవాడు, శివుడు}; అవసరమిచ్చెన్ = దర్శనమిచ్చెను.

భావము:

అలా దేవతలు దుఃఖంతో వచ్చుటను దయామయుడైన చంద్రరేఖను భూషణంగా ధరించే శంకరుడు చూసాడు. అప్పుడు సతీదేవితో కలిసి పేరోలగంలో ఉన్న శివుడు దేవతలకు దర్శనం ఇచ్చి ఆదరంగా “చెప్పుకోండి మీ విన్నపం” అన్నాడు.