పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : కూర్మావతారము

  •  
  •  
  •  

8-201-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నిధి జలముల లోపల
మునిఁగెడి గిరిఁ జూచి దుఃఖమునఁ జింతాబ్ధిన్
మునిఁగెడి వేల్పులఁ గనుఁగొని
జాక్షుఁడు వార్ధినడుమ వారలు చూడన్.

టీకా:

వననిధి = సముద్రము {వననిధి - వనము (నీటి)కి నిధి, సముద్రము}; జలము = నీటి; లోపలన్ = అందు; మునిగెడి = మునిగిపోతున్న; గిరిన్ = కొండను; చూచి = చూసి; దుఃఖమునన్ = శోకముతో; చింత = శోకమనెడి; అబ్ధిన్ = సముద్రమువ; మునిగెడి = మునిగిపోతున్న; వేల్పులన్ = దేవతలను; కనుగొని = చూసు; వనజాక్షుడు = హరి; వార్ధిన్ = సముద్రపు; నడుమన్ = మధ్యలో; వారలు = వారు; చూడన్ = చూచుచుండగ.

భావము:

దేవతలు అందరూ అలా మునిగిపోతున్న మంథర పర్వతాన్ని చూస్తూ అంతులేని దుఃఖసాగరంలో మునిగిపోతుంటే చూసిన విష్ణుదేవుడు, వారు చూస్తుండగానే సముద్రం మధ్య లోకి దిగాడు.