పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : సముద్ర మథన యత్నము

  •  
  •  
  •  

8-199-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విడు విడుఁ డని ఫణి పలుకఁగఁ
డుభరమున మొదలఁ గుదురు లుగమి గెడఁవై
బుబుడ రవమున నఖిలము
వడ వడఁకఁగ మహాద్రి నధి మునింగెన్.

టీకా:

విడు = విడిచిపెట్టండి; విడుడు = విడిచిపెట్టండి; అని = అని; ఫణి = సర్పము; పలుకగన్ = అరుచుచుండగ; కడు = అధికమైన; భరమునన్ = బరువువలన; మొదలన్ = క్రింద; కుదురు = కుదురు {కుదురు - కుదురుగా నిలుచుటకు ఏర్పరచెడి పీఠము}; కలుగమి = లేకపోవుటచేత; కెడవు = ఒరిగినది; ఐ = అయ్యి; బుడబుడ = బుడబుడ యనెడి; రవమునన్ = శబ్దముతో; అఖిలమున్ = సర్వము; వడవడ = వడవడ యని; వడకగన్ = వణికిపోగా; మహా = గొప్ప; అద్రి = కొండ; వనధిన్ = సముద్రమునందు; మునింగెన్ = మునిగినది.

భావము:

అమృతమథన సమయంలో వాసుకి “వదలండి వదలండి” అన్నాడు. మంథర పర్వతం అడుగున కుదురు లేకపోవడంతో అధిక బరువు వలన పడిపోతూ సముద్రంలో “బుడ బుడ” మని మునిగింది. దేవ రాక్షస సమూహం సమస్తం “వడ వడ” వణికింది.