పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : మంధరగిరిని తెచ్చుట

  •  
  •  
  •  

8-190-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని జలరాశి తటంబున
జాక్షుని గిరిని డించి వందనములు స
ద్వినుతులు జేసి ఖగేంద్రుఁడు
నివినియెను భక్తి నాత్మవనంబునకున్.

టీకా:

చని = వెళ్లి; జలరాశి = సముద్రము; తటంబునన్ = గట్టుమీద; వనజాక్షుని = హరిని; గిరిని = పర్వతమును; డించి = దించి; వందనములు = నమస్కారములు; సద్వినుతులు = స్తోత్రములు; చేసి = చేసి; ఖగేంద్రుడు = గరుడుడు {ఖగేంద్రుడు - ఖగము (పక్షుల)కు ఇంద్రుడు (ప్రభువు), గరుత్మంతుడు}; పనివినియెను = సెలవుతీసుకొనెను; భక్తిన్ = భక్తితో; ఆత్మ = తన; భవనంబున్ = నివాసమున; కున్ = కు.

భావము:

అలా గరుడుడు తీసుకెళ్ళి పాలకడలి ఒడ్డున విష్ణువును, మంథరపర్వతాన్ని దించాడు, భక్తితో నమస్కరించి సెలవు తీసుకొని తన నివాసానికి వెళ్ళిపోయాడు.