పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : మంధరగిరిని తెచ్చుట

  •  
  •  
  •  

8-186-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

టికి మముఁ బని బంచెను?
నేటికి మనఁ బోఁటివారి కింతలు పను? లిం
కేటికి రాఁడు రమేశ్వరుఁ?
డేటి కుపేక్షించె? మఱవ నేటికి మనలన్?"

టీకా:

ఏటి = ఎందుల; కిన్ = కు; మమున్ = మమ్ములను; పనిపంచెను = నియోగించెను; ఏటి = ఎందు; కిన్ = కు; మన = తమ; పోటి = వంటి; వారి = వారల; కిన్ = కి; ఇంతలు = ఇంతపెద్ద; పనులు = కార్యములు; ఇంకన్ = ఇంకను; ఏటి = ఎందు; కిన్ = కు; రాడు = రావడంలేదు; రమేశ్వరుడు = విష్ణువు {రమేశ్వరుడు - రమ (లక్ష్మీదేవికి) ఈశ్వరుడు (పతి), విష్ణువు}; ఏటి = ఎందుల; కున్ = కు; ఉపేక్షించెన్ = నిర్లక్ష్యముచేసెను; మఱవన్ = మరచిపోవుట; ఏటి = ఎందు; కిన్ = కు; మనలన్ = మనలను.

భావము:

ఇలాంటి పని భగవంతుడు ఎందుకు అప్పజెప్పాడు? మనలాంటి వారు ఇలాంటి పనులు చేపట్టి చేయగలరా? ఆ లక్ష్మీపతి అయిన విష్ణువు సహాయం చేయటానికి ఇంకా ఎందుచేత రావటం లేదో? ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాడో? మనకు సాయం రాకుండా ఇలా ఎందుకు మరచిపోయాడో?”