పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : సురలు బ్రహ్మ శరణు జొచ్చుట

  •  
  •  
  •  

8-152-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దునిఁ బరము జగద్గురు
రుణాపరతంత్రు మనము నుఁగొన దుఃఖ
జ్వములు చెడు" నని సురలకు
సిజజని చెప్పి, యజితు దనంబునకున్.

టీకా:

వరదుని = వరాలిచ్చెడివానిని; పరమున్ = పరమాత్ముని; జగద్గురున్ = లోకాలనుకాపాడువాడు {గురువు - 1ఉపాధ్యాయుడు 2బృహస్పతి 3కులముపెద్ద 4తండ్రి 5తండ్రితోడబుట్టినవాడు 6తాత 7అన్న 8మామ 9మేనమామ 10రాజు 11కాపాడువాడు}; కరుణాపరతంత్రున్ = కృపావశీకరుని; మనమున్ = మనమందరము; కనుగొనన్ = దర్శించినచో; దుఃఖ = శోకములు; జ్వరములున్ = బాధలు; చెడును = నశించును; అని = అని; సురల్ = దేవతల; కున్ = కు; సరసిజజని = బ్రహ్మదేవుడు {సరసిజజని - సరసిజ (పద్మము)నందు జని (పుట్టినవాడు), బ్రహ్మ}; చెప్పి = తెలియజెప్పి; అజితుసదనంబున్ = వైకుంఠమున {అజితుసదనము - అజితు (జయింపరాని వాడు, విష్ణువు) యొక్క సదనము (నివాసము), వైకుంఠము}; కున్ = కు.

భావము:

వరాలు ఇచ్చే వాడు, పరమాత్ముడూ, సకల లోకాలకు తండ్రి, దయామయుడు అయిన ఆ స్వామిని దర్శనం చేసుకుంటే, మన దుఃఖాలు, బాధలూ అన్నీ దూరం అవుతాయి.” అని చెప్పి, బ్రహ్మదేవుడు వేగంగా అజితుడైన ఆ భగవానుని స్థానానికి వెళ్ళాడు.