పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : 6చాక్షుసమనువు చరిత్ర

  •  
  •  
  •  

8-141-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

క్షుస్తనూజుండు చాక్షుషుం డను వీరుఁ-
డాఱవ మనువయ్యె వనినాథ!
భూమీశ్వరులు పురుః పురుష సుద్యుమ్నాదు-
లాతని నందను; మరవిభుఁడు
మంత్రద్యుమాఖ్యుఁ; డర్త్యు లాప్యాదికు-
లాహవిష్మద్వీరకాది ఘనులు
మునులందు విభుఁడు సంభూతికి వైరాజు-
కుఁ బుట్టి యజితుండు నాఁగ నొప్పె;

8-141.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తఁడు కాఁడె కూర్మమై మందరాద్రిని
నుదధి జలములోన నుండి మోచె;
తఁడు చువ్వె దివిజు ర్థింప నమృతాబ్ధిఁ
ద్రచ్చి యిచ్చె నా సుధారసంబు."

టీకా:

చక్షుః = చక్షువు యొక్క; తనూజుండు = పుత్రుడు; చాక్షుషుడు = చాక్షుషుడు; అను = అనెడి; వీరుడు = శ్రేష్ఠుడు; ఆఱవ = అరో (6); మనువు = మనువు; అయ్యెన్ = అయ్యెను; అవనినాథ = రాజ; భూమీశ్వరులు = రాజులు; పురుః = పురువు; పురుష = పురుషుడు; సుద్యుమ్న = సుద్యుమ్నుడు; ఆదులు = మొదలగువారు; ఆతని = అతని యొక్క; నందనులు = పుత్రులు; అమరవిభుడు = ఇంద్రుడు; మంత్రద్యుమ్న = మంత్రద్యుమ్నుడు అను; ఆఖ్యుడు = పేరుగలవాడు; అమర్త్యులు = దేవతలు; ఆప్యా = ఆప్యాయుడు; ఆదికులు = మొదలైనవారు; ఆ = ఆ; హవిష్మత్ = హవిష్మంతుడు; వీరక = వీరకుడు; ఆది = మున్నగు; ఘనులు = గొప్పవారు; మునులు = సప్తర్షులు; విభుడు = విష్ణుమూర్తి; సంభూతి = సంభూతి; కిన్ = కి; వైరాజున్ = వైరాజున; కున్ = కు; పుట్టి = పుట్టి; అజితుండు = అజితుడు; నాగ = అనగా; ఒప్పెన్ = ఒప్పియుండెను; అతడు = అతడు.
కాడె = కాదా; కూర్మము = కూర్మావతారుడు; ఐ = అయ్యి; మందర = మందర యనెడి; అద్రిని = పర్వతమును; ఉదధి = సముద్ర; జలము = నీటి; లోనన్ = లోపల; ఉండి = ఉండి; మోచెన్ = మోసెను; అతడు = అతడు; చువ్వె = సుమా; దివిజులు = దేవతలు; అర్థింపన్ = కోరగా; అమృతాబ్ధిన్ = పాలసముద్రమును; త్రచ్చి = చిలికి; ఇచ్చెన్ = ఇచ్చెను; ఆ = ఆ; సుధారసంబున్ = అమృతమును.

భావము:

పరీక్షిత్తు మహారాజా! ఆరవమనువుగా, చక్షువు పుత్రుడు చాక్షుషుడు అయ్యాడు. ఆ చాక్షుష మన్వంతరంలో, అతని కొడుకులు అయిన పురుడు, పురుషుడు, సుద్యుమ్నుడు మున్నగువారు రాజులయ్యారు, మంత్రద్యుముడు ఇంద్రుడు అయ్యాడు,ఆప్యాదులు దేవతలు అయ్యారు. హవిష్మంతుడు, వీరకుడు మున్నగువారు సప్తర్షులు అయ్యారు, వైరాజుకీ సంభాతికీ “అజితుడు” అనే పేరుతో విష్ణువు పుట్టాడు. అతడే కూర్మరూపం ధరించి మంథర పర్వతాన్ని సముద్రంలో మునిగిపోకుండా మోసాడు. దేవతలు ప్రార్థించగా క్షీరసాగరాన్ని చిలికి అమృతాన్ని దేవతలకు అందించాడు.
విశేష వివరణ -చతుర్దశ మన్వంతరాలలో నాలుగవదైనతామస మన్వంతరంలో గజేంద్ర మోక్షం ఘట్టం జరిగింది. తరువాత అయిదవదైన రైవత మన్వంతరం, ఆ తరువాతది ఆరవది అయిన చాక్షుష మన్వంతరం. ఈ మన్వంతరంలో క్షీరసాగర మధనం జరిగింది. ఆ పిమ్మట వచ్చినది ప్రస్తుతం నడుస్తున్న వైవశ్వత మన్వంతరం.