పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : స్వాయంభువాది చరిత్ర

  •  
  •  
  •  

8-6-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"ఈ ల్పంబున మనువులు
ప్రాటముగ నార్వురైరి దునలువురలో;
లోముల జనుల పుట్టువు
లాథితము లయ్యె వరుస ఖిలములు నృపా!

టీకా:

ఈ = ప్రస్తుత; కల్పంబున = కల్పమునందు; మనువులు = మనువులు; ప్రాకటముగన్ = ప్రసిద్ధముగ; ఆర్వురు = ఆరుగురు (6); ఐరి = అయినారు; పదునలువుర = పదునాల్గుర (14) {చతుర్దశ మనువులు - 1స్వాయంభువుడు 2స్వారోచిషుడు 3ఉత్తముడు 4తామసుడు 5రైవతుడు 6చాక్షుషుడు 7వైవస్వతుడు 8సూర్యసావర్ణి 9దక్షసావర్ణి 10బ్రహ్మసావర్ణి 11ధర్మసావర్ణి 12 రుద్రసావర్ణి 13రౌచ్యుడు 14భౌచ్యుడు}; లోన్ = లోను; లోకముల = లోకముల యొక్క; జనుల = లోకుల యొక్క; పుట్టువులున్ = సృష్టిగురించి; ఆకథితములు = పూర్తిగా చెప్పబడినట్టివి; అయ్యెన్ = అయినవి; వరుసన్ = క్రమముగా; అఖిలములున్ = అన్నియును; నృపా = రాజా {నృపుడు - నృ (నరులను) పాలించువాడు}.

భావము:

“ఓ రాజా పరీక్షిత్తూ! ఈ కల్పంలో పద్నాలుగురు మనువులలోనూ ఆరుగురు మనువులు కీర్తిశేషులు అయ్యారు. లోకాలు, జనులు సృష్టి విధానాలు గురించి వరుసగా అన్నీ చెప్పాను. (ప్రస్తుతం ఏడవది అయిన వైవస్వత మన్వంతరం నడుస్తున్నది)