పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : గజేంద్రుని దీనాలాపములు

  •  
  •  
  •  

8-70-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పృథుశక్తిన్ గజ మా జలగ్రహముతోఁ బెక్కేండ్లు పోరాడి, సం
శిథిలంబై, తన లావు వైరిబలముం జింతించి, మిథ్యామనో
మిం కేటికి? దీని గెల్వ సరి పోరం జాలరా దంచు స
వ్యమై యిట్లనుఁ బూర్వపుణ్యఫల దివ్యజ్ఞాన సంపత్తితోన్.

టీకా:

పృథు = అధికమైన; శక్తిన్ = బలముతో; గజము = ఏనుగు; ఆ = ఆ; జలగ్రహము = మొసలి; తోన్ = తోటి; పెక్కు = అనేక; ఏండ్లు = సంవత్సరములు; పోరాడి = పోరాటము చేసి; సంశిథిలంబు = పూర్తిగా నశించినది; ఐ = అయ్యి; తన = తన యొక్క; లావు = సామర్థ్యము; వైరి = శత్రువు యొక్క; బలమున్ = శక్తిని; చింతించి = తరచి చూసికొని; మిథ్యా = వ్యర్థమైన; మనోరథము = కోరిక; ఇంక = ఇంకను; ఏటికిన్ = ఎందుకని; దీనిన్ = దీనిని; గెల్వన్ = జయించుటకు; సరి = సమానంగా; పోరన్ = పోరుటకు; చాలరాదు = సాధ్యము కాదు; అంచున్ = అనుచు; సవ్యథము = దుఃఖముతో కూడినవాడు; ఐ = అయ్యి; ఇట్లు = ఈ విధముగ; అనున్ = పలికెను; పూర్వ = పూర్వము చేసిన; పుణ్య = పుణ్యము యొక్క; ఫల = ఫలిత మైన; దివ్య = దివ్య మైన; జ్ఞాన = జ్ఞానము యనెడి; సంపత్తి = సంపదల; తోన్ = తోటి.

భావము:

గజరాజు గొప్పబలంతో అనేక సంవత్సరాలు యుద్ధం జేసి చేసి చివరికి చితికిపోయాడు. తన సత్తువ శత్రువు బలం సరిపోల్చుకొని ఆలోచించుకొన్నాడు “అనవసర ప్రయత్నాలు నాకు ఎందుకు. దీనిని జయించటం, సరిసమంగా పోరాడటం రెండు నాకు సాధ్యంకావు.” అని దుఃఖించాడు. పూర్వజన్మల పుణ్య ఫలం వలన కలిగిన మేలైన జ్ఞానం వల్ల అతడు ఈ విధంగా అనుకోసాగాడు.