పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ప్రహ్లాదుని జన్మంబు

  •  
  •  
  •  

7-267-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లోము లన్నియున్ గడియలోన జయించినవాఁడ వింద్రియా
నీముఁ జిత్తమున్ గెలువ నేరవు నిన్ను నిబద్ధుఁ జేయు నీ
భీర శత్రు లార్వురఁ బ్రభిన్నులఁ జేయుము ప్రాణికోటిలో
నీకు విరోధి లేఁ డొకఁడు నేర్పునఁ జూడుము దానవేశ్వరా!

టీకా:

లోకముల్ = లోములను; అన్నియున్ = అన్నిటిని; గడియ = కొద్దికాలము; లోనన్ = లోనే; జయించినవాడవు = నెగ్గినాడవు; ఇంద్రియ = ఇంద్రియముల; అనీకము = సమూహము; చిత్తమున్ = మనసు; గెలువన్ = నెగ్గుట; నేరవు = చేయలేవు; నిన్నున్ = నిన్ను; నిబద్ధున్ = బంధనముల జిక్కుకొనిన వానిగ; చేయున్ = చేయును; నీ = నీ యొక్క; భీకర = భయంకరమైన; శత్రులార్వులన్ = అరిషడ్వర్గములను; ప్రభిన్నులన్ = ఓడినవారినిగా; చేయుము = చేయుము; ప్రాణి = జీవ; కోటి = జాలము; లోన్ = అందు; నీ = నీ; కున్ = కు; విరోధి = శత్రువు; లేడు = లేడు; ఒకడు = మరియొకడు; నేర్పునన్ = వివేకముతో; చూడుము = ఆలోచించుము; దానవేశ్వరా = రాక్షసరాజా.

భావము:

నువ్వేమో, రాక్షసరాజా! లోకాలు అన్నింటినీ క్షణంలో జయించావు; కానీ నీ లోని మనస్సునూ, ఇంద్రియాలనూ గెలువలేకపోయావు; వాటి ముందు నువ్వు ఓడిపోయావు; కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే ఆరుగురు శత్రువులు నిన్ను బందీ చేశారు; ఆ భయంకరమైన శత్రువులను అరిషడ్వర్గాలు అంటారు; వాటిని జయించి నశింపజేసావంటే జీవకోటి సర్వంలోనూ నీకు విరోధి ఎవ్వరూ ఉండడు. నా విన్నపం మన్నించు.