పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ప్రహ్లాదుని జన్మంబు

  •  
  •  
  •  

7-258-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ప్రజ్ఞావంతులు లోకపాలకులు శుంద్ధ్వేషు లయ్యున్ మదీ
యాజ్ఞాభంగము చేయ నోడుదురు రోషాపాంగదృష్టిన్ వివే
జ్ఞానచ్యుత మై జగత్త్రితయముం గంపించు నీ విట్టిచో
నాజ్ఞోల్లంఘన మెట్లు చేసితివి? సాహంకారతన్ దుర్మతీ!

టీకా:

ప్రజ్ఞావంతులు = శక్తి యుక్తులు గలిగిన; లోకపాలకులు = ఇంద్రుడు మొదలగువారు; శుంభత్ = వృద్ధినొందుతున్న; ద్వేషులు = పగ గలవారు; అయ్యున్ = అయినప్పటికిని; మదీయ = నా యొక్క; ఆజ్ఞన్ = ఆజ్ఞను; భంగము = దాటుట; చేయన్ = చేయుటకు; ఓడుదురు = బెదరెదరు; రోష = రోషముతో; అపాంగ = కడకంటి; దృష్టిన్ = చూపువలన; వివేక = మంచి చెడ్డలనెరిగెడి; జ్ఞాన = తెలివి; చ్యుతము = జారినది; ఐ = అయ్యి; జగత్త్రితయమున్ = ముల్లోకములు {ముల్లోకములు - భూలోకము స్వర్గలోకము పాతాళలోకము}; కంపించున్ = వణకిపోవును; నీవు = నీవు; ఇట్టిచోన్ = ఇలాంటి పరిస్థితిలో; ఆజ్ఞన్ = ఆజ్ఞను; ఉల్లంఘనమున్ = దాటుట; ఎట్లు = ఎలా; చేసితివి = చేసితివి; సాహంకారతన్ = పొగరుబోతుతనముతో; దుర్మతీ = చెడ్డబుద్ధిగలవాడా.

భావము:

దుర్బుద్ధీ! మహా ప్రతాపవంతులు అయిన దిక్పాలకులు, నా మీద ఎంత ద్వేషం పెంచుకుంటున్నా కూడా, నా మాట జవదాటటానికి బెదురుతారు; నేను కోపంతో కడకంట చూసానంటే చాలు, ముల్లోకాలూ వివేక, విజ్ఞానాలు కోల్పోయి అల్లకల్లోలం అవుతాయి; అలాంటిది, అహంకారంతో నువ్వు నా ఆజ్ఞను ఎలా ధిక్కరిస్తున్నావు?