పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ప్రహ్లాదుని జన్మంబు

  •  
  •  
  •  

7-253-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

డుగఁడు మధురిపుకథనము
విడివడి జడుపగిదిఁ దిరుగు వికసనమున నే
నొడివిన నొడువులు నొడువఁడు
దుడుకనిఁ జదివింప మాకు దుర్లభ మధిపా!

టీకా:

ఉడుగడు = మానడు; మధురిపు = హరి {మధురిపుడు - మధువనెడి రాక్షసునికి రిపుడు (శత్రువు), విష్ణువు}; కథనము = కీర్తనమును; విడివడి = కట్టుబాటునుండి తొలగి; జడున్ = మందుని; పగిదిన్ = వలె; తిరుగు = తిరుగుచుండును; వికసనమున = వికాసముతో; నేన్ = నేను; నొడవిన = చెప్పిన; నొడువులు = చదువులు; నొడువడు = చదవడు; దుడుకనిన్ = దుష్టుని; చదివింపన్ = చదివించుట; మా = మా; కున్ = కు; దుర్లభము = శక్యముకానిది; అధిపా = రాజా.

భావము:

ఓ మహారాజా! నీ కొడుకు ప్రహ్లాదుడు ఎవరు ఎన్ని చెప్పినా మధు దానవుని పాలిటి శత్రువు అయిన ఆ విష్ణువు గురించి చెప్పటం మానడు. ఎప్పుడూ మందమతిలా తిరుగుతూ ఉంటాడు. మనోవికాసం కోసం నేను చెప్పే మంచి మాటలు వినిపించుకోడు. చెప్పిన మాట విననే వినడు. ఇలాంటి దుడుకు వాడిని చదివించటం మా వల్ల కాదు.