పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ప్రహ్లాదుని జన్మంబు

  •  
  •  
  •  

7-245-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నుజ భుజగ యక్ష దైత్య మృగాభీర
సుందరీ విహంగ శూద్ర శబరు
లైనఁ బాపజీవు లైన ముక్తికిఁ బోదు
ఖిల జగము విష్ణుఁ నుచుఁ దలఁచి.

టీకా:

దనుజ = రాక్షసులు; భుజగ = సర్పములు; యక్ష = యక్షులు; దైత్య రాక్షసులు; మృగ జంతువులు; ఆభీర ఆభీరదేశపు; సుందరీ స్త్రీలు; విహంగ పక్షులు; శూద్ర = శూద్రులు; శబర = శబరులు, ఎఱుకలు; ఐన = అయిన; పాప = పాపములుచేసినవారైను; జీవులు ప్రాణులు; ఐన అయినను; ముక్తి = పరమపదమున; కిన్ = కి; పోదురు = వెళ్ళెదరు; అఖిల = సమస్తమైన; జగమున్ = విశ్వము; విష్ణుడు = విష్ణుమూర్తి; అనుచున్ = అనుచు; తలచి = భావించి.

భావము:

దనుజులు, రాక్షసులు, నాగులు, యక్షులు, దైత్యులు, జంతువులు, గొల్లలు, స్త్రీలు, శూద్రులు, శబరులు, ఇంకా ఏ జాతి వారైనా సరే, ఏ పాపజీవనులు అయినా సరే “సర్వం విష్ణుమయం జగత్” అని మనసారా తలచినట్లైతే చాలు, ముక్తిని పొందుతారు.