పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : బ్రహ్మవరము లిచ్చుట

  •  
  •  
  •  

7-99-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దితిపుత్రుండు జగత్త్రయైకవిభుఁడై దేవేంద్రసింహాస నో
ద్ధతుఁడై యుండ హరాచ్యుతాంబుజభవుల్ ప్పించి భీతిన్ సమా
తులై తక్కిన యక్ష కిన్నర మరుద్గంధర్వ సిద్ధాదు లా
తులై కానుక లిచ్చి కొల్తు రతనిన్ నానా ప్రకారంబులన్.

టీకా:

దితిపుత్రుండు = హిరణ్యకశిపుడు {దితిపుత్రుడు - దితి యొక్క పుత్రుడు, హిరణ్యకశిపుడు}; జగత్రయ = ముల్లోకములకు; ఏక = ఒక్కడే; విభుడు = ప్రభువు; ఐ = అయ్యి; దేవేంద్ర = దేవేంద్రుని; సింహాసన = పీఠమును; ఉద్ధతుడు = అధిష్టించినవాడు; ఐ = అయ్యి; ఉండన్ = ఉండగా; హర = శివుడు; అచ్యుత = విష్ణుమూర్తి; అంబుజభవుల్ = బ్రహ్మదేవుళ్ళు; తప్పించి = కాకుండగ; భీతిన్ = భయముతో; సమాగతులు = పొందికగలవారు; ఐ = అయ్యి; తక్కిన = మిగిలినవారు; యక్ష = యక్షులు; కిన్నర = కిన్నరలు; మరుత్ = మరుత్తులు; గంధర్వ = గంధర్వులు; సిద్ధుల్ = సిద్ధులు; ఆనతులు = నమ్రతగలవారు; ఐ = అయ్యి; కానుకలు = బహుమతులు; ఇచ్చి = సమర్పించి; కొల్తురు = సేవింతురు; అతనిన్ = అతనిని; నానప్రకారంబులన్ = పలువిధములుగ.

భావము:

ఇలా దితి కశ్యపుల కొడుకు హిరణ్యకశిపుడు ముల్లోకాలపై ఏకఛత్రాధిపత్యం సాగిస్తున్నాడు. ఇంద్రుని సింహాసనం ఎక్కి కూచుని గర్విస్తున్నాడు. అప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అయిన త్రిమూర్తులు తప్పించి, మిగతా దేవతలు, తమ తమ నేర్పుల కొలది కానుకలు ఇచ్చి సేవిస్తున్నారు.