పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : బ్రహ్మవరము లిచ్చుట

  •  
  •  
  •  

7-94-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సోరుఁ జంపిన పగ కై
యార మించుకయు లేక సురేంద్రుఁడు కం
జోరుపై వైరము దు
ర్మారతుం డగుచుఁ జేసె నుజాధీశా!

టీకా:

సోదరు = తమ్ముని; చంపిన = సంహరించిన; పగ = కక్ష; కై = కై; ఆదరము = మన్నన; ఇంచుకయున్ = కొంచెముకూడ; లేక = లేకుండగ; అసురేంద్రుడు = హిరణ్యకశిపుడు {అసురేంద్రుడు - అసురుల (రాక్షసుల)కు ఇంద్రుడు (ప్రభువు), హిరణ్యకశిపుడు}; కంజోదరు = నారాయణుని {కంజోదరుడు - కంజము (పద్మము) ఉదరమునగలవాడు, విష్ణువు}; పైన్ = మీద; వైరము = శత్రుత్వము; దుర్మాద = చెడ్డ మదమునందు; రతుండు = మిక్కిలి ఆపేక్షగలవాడు; అగుచున్ = అగుచు; చేసెన్ = చేసెను; మనుజాధీశ = రాజా {మనుజాధీశుడ - మనుజు (మానవు)లకు అధీశుడు, రాజు}.

భావము:

ఓ ధర్మరాజా! ఇలా కొవ్వెక్కిన రాక్షసరాజు హిరణ్యకశిపుడు తన తమ్ముడిని చంపాడు అని పగబూని నీతిమాలి పద్మనాభస్వామి విష్ణుమూర్తి మీద విడువని శత్రుత్వం పెంచుకున్నాడు.