పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : బ్రహ్మవరము లిచ్చుట

  •  
  •  
  •  

7-114-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని యిట్లు దనుజమర్దనుండు నిర్దేశించిన నిలింపులు గుంపులుగొని మ్రొక్కి రక్కసుండు మ్రగ్గుట నిక్కం బని తమతమ దిక్కులకుం జనిరి; హిరణ్యకశిపునకు విచిత్ర చరిత్రులు నలువురు పుత్రు లుద్భవించిరి; అందు.

టీకా:

అని = అని; ఇట్లు = ఈ విధముగ; దనుజమర్దనుండు = నారాయణుడు {దనుజమర్దనుడు - దనుజ (రాక్షసులను) మర్దనుడు (శిక్షించువాడు), విష్ణువు}; నిర్దేశించినన్ = నిర్ణయించి చెప్పగా; నిలింపులు = దేవతలు; గుంపులు = సమూహములుగా; కొని = కూడుకొని; మ్రొక్కి = నమస్కరించి; రక్కసుండు = రాక్షసుడు; మ్రగ్గుట = నాశన మగుట; నిక్కంబు = తథ్యము; అని = అని; తమతమ = వారివారి; దిక్కుల = గమ్యముల; కున్ = కు; చనిరి = వెళ్ళిరి; హిరణ్యకశిపున్ = హిరణ్యకశిపుని; కున్ = కి; విచిత్ర = అబ్బురమైన; చరిత్రులు = నడవడికలు గలవారు; నలువురు = నలుగురు (4); పుత్రులు = కొడుకులు; ఉద్భవించిరి = పుట్టిరి; అందు = వారిలో.

భావము:

ఇలా అసురవైరి విష్ణువు, దేవతలకు ధైర్యం చెప్పి పంపాడు. వారు రాక్షసుడు ఎలాగైనా చావటం ఖాయం అనే ధైర్యంతో గుంపులుకట్టి, వారి వారి నివాసాలకు వెళ్ళారు. ఇంతలో హిరణ్యకశిపుడికి అబ్బురమైన చరిత్ర కల నలుగురు కొడుకులు పుట్టారు.