పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : సుయజ్ఞోపాఖ్యానము

  •  
  •  
  •  

7-77-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నీ వేరీతిఁ దపోబలంబున జగన్నిర్మాణముం జేసి యీ
దేవాధీశులకంటె నెక్కుడు సిరిం దీపించి తిబ్బంగిఁ దా
నీ విశ్వంబుఁ దపస్సమాధిమహిమన్ హింసించి వేఱొక్క వి
శ్వావిర్భావకరత్వశక్తి మదిలో ర్థించినాఁ డీశ్వరా!

టీకా:

నీవు = నీవు; ఏ = ఎట్టి; రీతిన్ = విధానముగ; తపస్ = తపస్సు యొక్క; బలంబునన్ = శక్తివలన; జగత్ = లోకముల; నిర్మాణమున్ = సృష్టిన్; చేసి = చేసి; ఈ = ఈ; దేవాధీశుల = దేవతా ప్రభుల; కంటెను = కంటెను; ఎక్కుడు = అధికమైన; సిరిన్ = ఐశ్వర్యముతో; దీపించితి = ప్రకాశించితివి; ఈ = ఇట్టి; భంగిన్ = విధముగనే; తాన్ = తను; ఈ = ఈ; విశ్వంబున్ = భువనములను; తపస్సు = తపస్సు; సమాధి = సమాధుల; మహిమన్ = శక్తివలన; హింసించి = నాశనముచేసి; వేఱొక్క = మరియొక; విశ్వ = జగత్తును; ఆవిర్భావ = తయారు; కరత్వ = చేసెడి; శక్తిన్ = శక్తిని; మది = మనసు; లోన్ = అందు; అర్థించినాడు = ఆశించినాడు; ఈశ్వరా = భగవంతుడా, బ్రహ్మదేవుడా;

భావము:

ఓ మహాప్రభూ! బ్రహ్మదేవా! నీవు నీ మహనీయమైన తపోబలంతో, ప్రపంచ నిర్మాణం చేసావు. ఈ దేవోత్తములు అందరి కంటే ఎక్కువ ఐశ్వర్యాన్ని కీర్తి ప్రతిష్ఠలను సంపాదించుకున్నావు. నీలాగే ఈ రాక్షసుడు హిరణ్యకశిపుడు కూడా తన తపోమహిమతో నీవు సృష్లించిన ఈ విశ్వాన్ని నాశనము చేసి, మరొక క్రొత్త విశ్వాన్ని నిర్మిస్తాడుట. అంతటి శక్తి సంపాదించటానికే ఇలా ఘోరంగా తపస్సు చేస్తున్నాడట.