పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : సుయజ్ఞోపాఖ్యానము

  •  
  •  
  •  

7-66-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కాము వచ్చిన శబరుని
కోను ధరఁగూలె ఖగము ఘోషముతోడం
గాము డాసిన నేలం
గూక పో వశమె యెట్టి గుణవంతులకున్.

టీకా:

కాలము = అదను, సమయము; వచ్చిన = రాగా; శబరుని = కోయవాని; కోలను = బాణమువలన; ధరన్ = నేలపైన; కూలెన్ = పడిపోయెను; ఖగము = పక్షి; ఘోషము = గోలపెట్టుట; తోడన్ = తోటి; కాలము = కాలము, అదను; డాసిన = కలిసివచ్చిన; నేలంగూలక = మరణించకుండుట; వశమె = సాధ్యమేనా ఏమి; ఎట్టి = ఎటువంటి; గుణవంతుల = తెలివిగలవారి; కున్ = కైనను.

భావము:

కాలం మూడిన ఆ మగ పక్షి గోలపెట్టిమరీ అలా బోయవాడి బాణం దెబ్బతిని పడి చచ్పిపోయింది. అవును, ఆయువు తీరిన తరువాత చావకుండా ఉండటం అన్నది ఎంతటి తెలివైనవాడైనా, బలవంతుడైనా, అధికార సంపదలు కలవాడి కైనా అసాధ్యమే కదా.