పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : సుయజ్ఞోపాఖ్యానము

  •  
  •  
  •  

7-57-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

, లురులు, జిగురుఁ గండెలుఁ,
లిదియు, జిక్కంబు, ధనువు, రములుఁ గొనుచుం
బులుఁగులఁ బట్టెడు వేడుక
లుఁగులు వెడలంగఁ గదలి డవికిఁ జనియెన్.

టీకా:

వలల్ = వలలు; ఉరులు = ఉరితాళ్ళు; జిగురుగండెలున్ = బంకపూసినదారపుకండెలు; చలిదియున్ = చద్ది అన్నము మూట; చిక్కంబున్ = సంచి; ధనువు = విల్లు; శరములున్ = బాణములు; కొనుచున్ = తీసుకొని; పులుగులన్ = పక్షులను; పట్టెడు = పట్టుకొనెడి; వేడుకన్ = ఆసక్తి; అలుగులు వెడలంగ = అధికముకాగా; కదలి = బయలుదేరి; అడవి = అడవి; కిన్ = కి; చనియెన్ = వెళ్లెను.

భావము:

పిట్టల వేటగాడైన కిరాతుడు ఉచ్చుకఱ్ఱ అనే పక్షులు పట్టుకునే కఱ్ఱకు కట్టిన తాళ్ళు, వలలు, జిగురుబంక పూసిన దారపు కండెలు, చద్దెన్నం మూట, చిక్కం అనే తాళ్ళతో చేసిన సంచి, విల్లు అమ్ములు పట్టుకుని పిట్టలను పట్టుకోవాలనే కోరికమీరగా అడవికి బయలుదేరాడు.