పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : హిరణ్యాక్ష హిరణ్యకశిపుల కథ

  •  
  •  
  •  

7-35-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని యిట్లు నిర్దేశించిన దివిజమర్దను నిర్దేశంబులు శిరంబుల ధరియించి రక్కసులు పెక్కండ్రు భూతలంబునకుం జని.

టీకా:

అని = అని; ఇట్లు = ఈ విధముగా; నిర్దేశించిన = నియమించగా; దివిజమర్దను = దేవాంతకుడగు హిరణ్యాక్షుని; నిర్దేశంబులు = ఆజ్ఞలను; శిరంబులన్ = తలలపై; ధరియించి = పూని; రక్కసులు = రాక్షసులు; పెక్కండ్రు = అనేకమంది; భూతలంబున్ = భోలోకమున; కున్ = కు; చని = వెళ్ళి.

భావము:

దేవతలను మర్దించే ఆ రాక్షసరాజు హిరణ్యకశిపుడి ఆజ్ఞను ఆ రాక్షసప్రముఖులు అందరూ శిరసావహించి, మూకలు గట్టి వచ్చి భూలోకంపై పోయి పడ్డారు.