పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : హిరణ్యాక్ష హిరణ్యకశిపుల కథ

  •  
  •  
  •  

7-28-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రిభూత వ్యధనంబులు,
నిరుపమ సంసారజలధి నిర్మథనంబుల్
కేసరి కథనంబులు,
రిరక్షిత దేవ యక్ష ణి మిథునంబుల్.

టీకా:

పరిభూత = పూర్తిగా పోగొట్టబడిన; వ్యధనంబులు = బాధలు కలవి; నిరుపమ = సాటిలేని; సంసార = సంసారము అనెడి; జలధిన్ = సాగరమును; నిర్మథనంబులు = మిక్కిలి మథించెడివి; నరకేసరి = నరసింహుని; కథనంబులు = చారిత్రములు; పరిరక్షిత = చక్కగా రక్షింపబడిన; దేవ = దేవతల; యక్ష = యక్షుల; ఫణి = నాగుల; మిథునంబుల్ = దంపతులు కలవి.

భావము:

విష్ణుమూర్తి యొక్క నారసింహావతార కథలు వ్యథలు పోగొట్టేవి, సుధలు కురిపించేవి, అనంత సంసార సాగరాన్ని దాటింపజేసేవి. దేవతలు, యక్షులు, పక్షులు మున్నగు దాంపత్య జీవితం కలిగిన జాతులు అన్నిటికి క్షేమములు కలిగించేవి.