పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : హిరణ్యాక్ష హిరణ్యకశిపుల కథ

  •  
  •  
  •  

7-22-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

డింకుల ననర్గళ వి
స్రంకుల రమాధినాథ ల్లాప సుఖా
రంకుల ముక్తమానస
దంకులం జొరఁగనీక ఱిమి రధీశా!

టీకా:

డింభకులన్ = బాలురను; అనర్గళ = అడ్డులేని; విస్రంభకులన్ = చొరవగలవారిని; రమాధినాథ = విష్ణుని గురించిన {రమాధినాథుడు - రమ (లక్ష్మీదేవి)కి అధినాథుడు (భర్త), విష్ణువు}; సత్ = మంచి; ఆలాప = మాటలు వలన; సుఖ = సుఖమున; ఆరంభకులన్ = పూనినవారిని; ముక్త = విడువబడిన; మానస = మనసునందలి; దంభకులన్ = గంర్వములు గలవారిని; చొరంగనీక = ప్రవేశింపనీయక; తఱిమిరి = తరిమిరి; అధీశా = మహారాజా.

భావము:

ఓ యుధిష్ఠర మహారాజా! సనకాదులు గర్వం అంటే తెలియని నిర్మలమైన బాలుర రూపంలో ఉన్నారు. లక్ష్మీపతి అయిన విష్ణువుతో మంచిమాటలు మాట్లాడాలనే ఆసక్తిలో మునిగి మిక్కిలి చొరవగా విష్ణుమందిరంలో ప్రవేశించబోతున్నారు. అట్టి వారిని ఆ ద్వారపాలకులు అడ్డుకొని గెంటేశారు.