పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : నారాయణుని వైషమ్య అభావం

  •  
  •  
  •  

7-8-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నాయక! యీ యర్థము
యశుఁ డగు ధర్మజునకుఁ గ్రతుకాలమునన్
మును నారదుండు చెప్పెను
వినిపించెద వినుము చెవులు విమలత నొందన్.

టీకా:

జననాయక = రాజా {జననాయక - జనులకు నాయకుడు, రాజు}; ఈ = ఇట్టి; అర్థము = సందర్భము నందు; ఘన = గొప్ప; యశుడు = కీర్తి గలవాడు; అగు = అయిన; ధర్మరాజున్ = ధర్మరాజున; కున్ = కు; క్రతు = యజ్ఞ; కాలమునన్ = సమయము నందు; మును = పూర్వము; నారదుండు = నారదుడు; చెప్పెను = తెలియజెప్పెను; వినిపించెదన్ = చెప్పెదను; వినుము = వినుము; చెవులు = చెవులు; విమలతన్ = నిర్మలత్వమును; ఒందన్ = పొందునట్లుగా.

భావము:

జనులందరిని సరైన మార్గంలో నడిపించే ఓ పరీక్షిన్మహారాజా! ఇప్పుడు నీవడిగిన సంగతినే పూర్వం ధర్మవిదుడైన ధర్మరాజునకు రాజసూయయాగ సమయంలో ధర్మవిదు డైన నారదమహర్షి చెప్పాడు. ఇప్పుడు నీకు చెప్తాను చెవులకు పండువుగా విను,