పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ప్రహ్లాదాజగర సంవాదము

  •  
  •  
  •  

7-442-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ను నజగరమునివల్లభు
నుజేంద్రుఁడు పూజ చేసి గ వీడ్కొని నె
మ్మమున సంతోషించుచుఁ
నియెన్ నిజ గేహమునకు శికులతిలకా!

టీకా:

ఘనున్ = గొప్పవానిని; అజగర = అజగరుడు యనెడి; ముని = ముని; వల్లభున్ = ప్రభువును; దనుజేంద్రుండు = దానవరాజు; పూజ = అర్చనలు; చేసి = చేసి; తగన్ = శ్రీఘ్రమే; వీడ్కొని = సెలవుతీసుకొని; నెఱి = నిండు; మనమునన్ = మనసుతో; సంతోషించుచున్ = సంతోషించుచు; చనియెన్ = వెళ్ళెను; నిజ = తన; గేహమున్ = ఇంటి; కున్ = కి; శశికులతిలకా = ధర్మరాజా {శశికులతిలకుడు - శశి (చంద్ర) కుల (వంశమునకు) తిలకా (ముఖ్యాభరణమైన వాడు), ధర్మరాజు}.

భావము:

ఓ చంద్రవంశ వరేణ్యా! ధర్మరాజా! అలా చెప్పిన అజగర మునీశ్వరుని మాటలు విని, ఆయనను పూజించి, నమస్కరించి, సెలవు తీసుకుని ప్రహ్లాదుడు ఆహ్లాదంగా తన అంతఃపురానికి వెళ్ళాడు.”